ఉపాసన కీలక ప్రకటన.. తెలంగాణలో అపోలో భారీ ప్రణాళిక

  • తెలంగాణలో అపోలో గ్రూప్ భారీ పెట్టుబడులకు సిద్ధం
  • రానున్న మూడేళ్లలో రూ.1700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఉపాసన ప్రకటన
  • మహిళలు, యువత సాధికారతే లక్ష్యంగా 24 వేల ఉద్యోగాల కల్పన
  • తమ ఫార్మసీల ద్వారా ఏటా 2.6 లక్షల కుటుంబాలకు అండ‌గా ఉంటున్నామ‌న్న ఉపాస‌న‌
తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అపోలో గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో రూ.1700 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ సీఎస్ఆర్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా 24 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ మేరకు ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణకు తమ అపోలో కుటుంబం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, యువత సాధికారతే లక్ష్యంగా ఈ ఉద్యోగాల కల్పన ఉంటుందని ఆమె వివరించారు.

తమ గ్రూప్‌కు చెందిన వెయ్యికి పైగా ఫార్మసీల ద్వారా ఇప్పటికే ఏటా 2,62,749 కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని ఉపాసన తెలిపారు. ఈ కొత్త పెట్టుబడులతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేయాలనేది తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. తాజా పెట్టుబడి ప్రకటనతో తెలంగాణ ఆరోగ్య రంగంలో మరిన్ని అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Upasana Kamineni
Apollo Hospitals
Telangana
Healthcare Investment
Job Creation
Pharma
CSR
Women Empowerment
Youth Empowerment
Hyderabad

More Telugu News